Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగారూలపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. 36 పరుగుల తేడాతో గెలుపు

Webdunia
శనివారం, 18 జనవరి 2020 (10:46 IST)
టీమిండియా ఆస్ట్రేలియాపై గెలుపును నమోదు చేసుకుంది. గెలిచి తన లెక్కను సరిచేసుకుంది. భారత బ్యాట్స్‌మెన్లు మెరుగ్గా రాణించటంతో కంగారూలపై కోహ్లీసేన విజయభేరి మోగించింది. తొలి వన్డేలో ఎదురైన ఘోర పరాజయానికి భారత్ బదులు తీర్చుకుంది.

రాజ్ కోట్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన భారత్ మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 340 పరుగులు చేసింది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన ఆసీస్ 49.1 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) పోరాడినా ఫలితం దక్కలేదు.
 
రెండు వికెట్లు సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ను మలుపుతిప్పగా, షమీ (3), సైనీ (2), జడేజా (2) సమయోచితంగా రాణించి జట్టు విజయంలో పాలుపంచుకున్నారు.  ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జనవరి 19 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ అద్బుత ఇన్నింగ్స్ ఆడారు. 
 
స్మిత్, లబుషేన్‌లు క్రీజులో ఉన్నంత సేపూ వికెట్ల కోసం చెమటోడ్చిన భారత బౌలర్లు ఆ తర్వాత విజృంభించారు. 38వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. జోరుమీదున్న స్మిత్‌ (98)ను సెంచరీ ముంగిట బౌల్డ్ చేసి ఆసీస్‌కు భారీ ఝలకిచ్చాడు.
 
ఆ తర్వాత 44వ ఓవర్లో తొలి రెండు బంతుల్లోనూ రెండు వికెట్లు తీసిన షమీ.. ఆసీస్ విజయావకాశాలను దెబ్బతీసి భారత్‌కు విజయాన్ని చేరువ చేశాడు. ఇక నవదీప్ సైనీ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి భారత విజయాన్ని ఖాయం చేసాడు. ఇక చివరి ఓవర్లో బుమ్రా జంపాను ఔట్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు.. జడేజా, కుల్దీప్‌,సైనీలు తలా 2 వికెట్లు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

leopard: తల్లిదండ్రులతో నిద్రస్తున్న మూడేళ్ల చిన్నారిని లాక్కెళ్లిన చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే?

Chandra Babu: నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు లభించింది: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

వివాహేతర సంబంధం.. 35 ఏళ్ల వ్యక్తిని భార్య, ప్రియుడు, సహచరుడు గొంతుకోసి చంపేశారు..

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధించిన కోర్టు

Nellore: భారీ వర్ష హెచ్చరికలు.. నెల్లూరు ప్రజలకు అలెర్ట్ - చేపల వేటకు వెళ్ళొద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

తర్వాతి కథనం
Show comments